Crimejournalist

Feb 01 2024, 18:44

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాస్ పుస్తకాలు ఇంట్లోని వస్తువులు దగ్దం

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పాస్ పుస్తకాలు దగ్ధం

     

     

సూర్యాపేట జిల్లా:

[ Crime journalist 01-02-2024 ] :-కోదాడ మండల పరిధిలోని తొగర్రాయి గ్రామం పదో వార్డు నివాసి శీలం సీతారాములు ఇంటిలో కరెంటు షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి పాస్ పుస్తకాలు విలువైన వస్తువులు సుమారు 12 వేల రూపాయలు వరకు పూర్తిగా కాలిపోయినవి. ఇంట్లో ఉన్న మొత్తం వస్తువులు గిన్నెలు పూర్తిగా దగ్ధం అయిపోయినవి.వార్త తెలుసుకున్న మరుక్షణమే స్థానిక సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ పరిశీలించి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శీలం సీతారాములు భార్య భర్తలు ఇద్దరూ వృద్ధులు వృద్ధాప్యంలో జీవనం సాగిస్తున్నారు జీవన ఉపాధి సాగించడం కష్ట పరిస్థితుల్లో ఉన్నది భార్య భర్తలు ఇద్దరు వికలాంగులైన జీవనం సాగిస్తున్నారు ఆర్థిక పరిస్థితి బాగాలేదని వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ దొంగల లక్ష్మీనారాయణ తెలియజేశారు.

Crimejournalist

Feb 01 2024, 17:43

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షుడు

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన

భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా[ Crime journalist 01-02-2024] :-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి మండలం షీలాపూర్ పల్లి గ్రామానికి కీ చెందిన ఉల్లి గడ్డ రైతు రెండు ఎకరాలు వేసి మూడు లక్ష రూపాయల పంటను తీసి ఉల్లి పంటలో విశేషంగా రాణిస్తున్న బాలయ్య బుధవారం మండల కేంద్రంలో తన ట్రాక్టర్ లో ఉల్లిగడ్డ ను అమ్ముతున్నా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. పెట్టుబడి ఇతర ఖర్చులు పోనూ మంచి లాభం ఉంటుందనీ రైతు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం తెలుగు పరిశోధకులు వేల్పుల శంకర్,పవ్వాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Feb 01 2024, 11:34

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్యను సిఎం రేవంత్ రెడ్డి పరామర్శించాలని కోరిన ఓయూ విద్యార్థి నేత

BREAKING NEWS 

[Crime journalist 01-02-2024]

ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య గారిని పరామర్శించాలని సీఎం రేవంత్ రెడ్డి ని కోరిన ఓయూ విద్యార్థి నేత, టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్,త్వరలో చుక్కా రామయ్య గారి నివాసానికి వెల్దామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి,ఉద్యమ కారుల పట్ల మేధావుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ గారి పేరు మీద నంది అవార్డులు.గద్దర్ జయంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇక మీదట నంది అవార్డుల బదులుగా గద్దర్ అవార్డులుప్రకటిస్తామని చెప్పడం చారిత్రాత్మకమైన రోజుగా బావించాలి,చనగాని దయాకర్

టీపీసీసీ అధికారుల ప్రతినిధి

ఓయూ విద్యార్థి నేత.

Crimejournalist

Jan 31 2024, 18:03

రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యల పై క్షమాపణ చెప్పాలని డిమాండ్

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యల పై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్

నల్లగొండ జిల్లా:

[Crime journalist 31-01-2024]

నకిరేకల్ నియోజకవర్గంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా సమావేశంలో గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పై బిఆర్ఎస్ నాయకులు చేసిన వాక్యాలపై క్షమాపణ చెప్పాలని నకిరేకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు దైద రవీందర్.

Crimejournalist

Jan 31 2024, 17:45

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించిన భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షుడు

ఉల్లి పంట ఉత్పత్తిలో రాణిస్తున్న రైతును సన్మానించినభారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు

సిద్దిపేట జిల్లా[ Crime journalist 31-01-2024] :-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం కోహెడ మండలం మండల కేంద్రంలో ఉల్లి గడ్డ పంటను అత్యధిక దిగుబడి సాదించి అమ్ముతున్నా గంగాధర బాలయ్య అనే రైతును ప్రముఖ సామజిక కార్యకర్త, పిడిశెట్టి రాజు అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా సన్మానం చేసి ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ బెజ్జంకి మండలం షీలాపూర్ పల్లి గ్రామానికి కీ చెందిన ఉల్లి గడ్డ రైతు రెండు ఎకరాలు వేసి మూడు లక్ష రూపాయల పంటను తీసి ఉల్లి పంటలో విశేషంగా రాణిస్తున్న బాలయ్య బుధవారం మండల కేంద్రంలో తన ట్రాక్టర్ లో ఉల్లిగడ్డ ను అమ్ముతున్నా వారిని పలువురు ప్రత్యేకంగా అభినందించారు. పెట్టుబడి ఇతర ఖర్చులు పోనూ మంచి లాభం ఉంటుందనీ రైతు తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర జాక్ కన్వీనర్ మంద మల్లేశం, ఉస్మానియా విశ్వవిధ్యాలయం తెలుగు పరిశోధకులు వేల్పుల శంకర్,పవ్వాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Jan 31 2024, 17:34

ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన ఎస్ఐ.తిరుపతి

ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేసిన కోహెడ ఏస్ ఐ తిరుపతి

సిద్దిపేట జిల్లా [Crime journalist 31-01-2024]:-

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం :

( కోహెడ మండలం ):- భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు పేరుతో రూపొందించిన క్యాలెండర్ ను ప్రముఖ సామజిక కార్యకర్త, పీవీ సేవా సమితి అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో కోహెడ సబ్ ఇన్స్ పెక్టర్ సి హెచ్ తిరుపతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ దక్షణ భారతదేశంలో జన్మించి సుమారు 18భాషల్లో ప్రావీణ్యం పొందిన తెలుగు తొలి ప్రధాని పీవీ నరసింహారావు నూతన ఆర్థిక సంస్కరణలు, విద్యా సంష్కరణలు, భూ సంష్కరణ లు రూపొందించిన అపార చాణిఖ్యలు వారి పేరుతో వారి కుటుంబ సభ్యులు, సురభి విద్యాసంస్థలు నిర్మాణం చేసిన క్యాలెండర్ నూ ఆవిష్కరణ చేసినందుకు చాలా గర్వాంగా ఉంది అని ఏస్ ఐ తిరుపతి అన్నారు. భారత దేశ ప్రధాని పేరుతో గత పదిహేను ఏళ్లుగా వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నా రాజుని ప్రత్యేకంగా అభినందించారు. ఈకార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ లింగారెడ్డి,కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర జాయింట్ కో ఆర్డినేటర్ తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్,గ్రామ కార్యదర్శి బండి శ్రీనివాస్,వి శంకర్, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Jan 31 2024, 07:51

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే


మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే 

నల్గొండ జిల్లా: [ Crime journalist 30-01-2024 ] :-

నకిరేకల్ నియోజకవర్గం: కట్టంగూర్ మండలం అయిటిపాముల గ్రామంలో మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా వారి విగ్రహానికి నకిరేకల్ ఎమ్మెల్యే పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ₹- 30.00 లక్షల వ్యయంతో నూతన నిర్మాణ చేపడుతున్న గ్రామ పంచాయతీ భవనం శంకుస్థాపన చేసినన ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం.

పాల్గొన్న స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు గ్రామస్తులు

ఈ సందర్భంగా నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం మాట్లాడుతూ ఐదు సంవత్సరాలు పాటు ఎన్ని కష్టాలు వచ్చిన నాతో కలిసి నడిచిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు.

ఈ గ్రామ పంచాయతీ భవన నిర్మాణాని విశాలంగా నిర్మాణం చేసుకుందాం,అయిటిపాముల గ్రామ చెరువులోకి త్వరలో నీరు అందిస్తా,ఈ గ్రామాని నుండి రసుల్ గూడెం, రామచంద్రాపల్లె రోడ్డు ను నిర్మాణం చేసుకుందాం,పానగల్ చెరువు నుండి అయిటిపాముల చెరువు వచ్చే కాలువను సిమెంట్ లైనింగ్ వేసుకుద్దాం,రానున్న ఎన్నికల్లో పార్లమెంటు, సర్పంచ్, ఎంపీటీసీ, ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి తప్పకుండా ఈ గ్రామాని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తా,ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్న నేను పరిష్కారం చేస్తా. ఈకార్యక్రమంలో. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెద్ది సుక్కయ్య గౌడ్,ఎంపీపీ జెల్లా ముత్తిలింగయ్య,మాజీ జడ్పీటీసీ&ఎంపీటీసీ టు మాద యాదగిరి,నకిరేకల్ నియోజకవర్గ టీపీసీసీ ప్రతినిధి సుంకరబోయిన నర్సింహ్మ యాదవ్,ఎంపీటీసీల పోరం మండల అధ్యక్షులు పాలడుగు హరికృష్ణ ( బాబు)సర్పంచ్లు, ఉపసర్పంచ్లు,వార్డ్ నెంబర్లు,అధికారులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Crimejournalist

Jan 30 2024, 21:11

శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జనం కోసం జనసేన మహాయజ్ఞం

శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావడం కోసం జనం కోసం జనసేన మహాయజ్ఞం

[Crime journalist 30-01-2024]:- 

శ్రీ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి" కావడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో జనం కోసం జనసేన మహాయజ్ఞం 784వ రోజు ఈ రోజు 30-01-2024వ తేదీన కిర్లంపూడి మండలం కిర్లంపూడి గ్రామంలో జరిగింది.

జనం కోసం జనసేన మహాయజ్ఞం 785వ రోజు రేపు 31-01-2024వ తేదీన కార్యక్రమాలు.

గండేపల్లి మండలం,సూరంపాలెం, రామేశంపేట మరియు యర్రంపాలెం గ్రామాలలో రేపు ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు సూర్యచంద్ర గారి సతీమణి శ్రీదేవి, మరదళ్ళు సూర్యప్రభ,దేవి, చెల్లెలు భవాని, అన్నయ్యలు కామరాజు, ఆదినారాయణ, తమ్ముళ్లు,శివరామకృష్ణ,వాసు, పెద్దకాపు,రామకృష్ణ,వీరబాబు, అబ్బాయిలు శ్రీహరి నరేష్,

మణికంఠ,గంగాధర్,నరేష్, బావగారు వీరభద్రరావు, మేనల్లుళ్ళు అయ్యప్ప,మల్లేష్, గంగాధర్ కొనసాగిస్తారు. కావున ఈ కార్యక్రమంలో జనసైనికులు అందరూ పాల్గొని విజయవంతం చేస్తారని కోరుచున్నాము.ఈ రోజు కార్యక్రమాన్ని విజయవంతం చేసిన తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు డేగల విజయ్ కుమార్, కిర్లంపూడి మండల అధ్యక్షులు ఉలిసి అయిరాజ్, జగ్గంపేట మండల జెడ్పీటీసీ అభ్యర్థిని మరిశే శ్యామల, కిర్లంపూడి మండల ఉపాధ్యక్షులు గంధం ప్రభాకర్, కిర్లంపూడి మండల ప్రధాన కార్యదర్శి శెట్టి గంగా మహేష్, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి జువ్వల శ్రీను, కిర్లంపూడి మండల సంయుక్త కార్యదర్శి నాగబొయిన శివ, కిర్లంపూడి నుండి దూలిపూడి దుర్గ, లంక దుర్గ అయ్యప్ప, రామకృష్ణాపురం నుండి డేగల గణేష్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబ, వల్లపుశెట్టి నాని, జానకి మంగరాజు, కంపిన వీరబాబు, జల్లిగంపల శ్రీను, సందు చిన్నోడు, బూరుగుపూడి నుండి కుండ్లమహంతి సత్తిబాబు గార్లకు కృతజ్ఞతలు తెలిపారు.

జనం కోసం జనసేన కార్యక్రమంలో భాగంగా కిర్లంపూడి గ్రామంలో ఎంతో ప్రేమానురాగాలతో ఆతిథ్యంఅందించిన నాగబోయిన శివ గారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా

ఈ రోజు నైట్ స్టే సూరంపాలెం గ్రామంలో గల రామాలయంలో.

పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర 

జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్.

Crimejournalist

Jan 30 2024, 20:17

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

Today news information*

[Crime journalist 30-01-2024] :-

బీజేపీ నుంచి రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి?

మెగాస్టార్ చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

ఏపీలో పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. ఆ రాష్ట్రానికి చెందిన మెగాస్టార్ చిరంజీవిని పార్టీ తరుఫున రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. 

ఆయనను యూపీ నుంచి రాజ్యసభ బరిలో నిలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా ఎలక్షన్ ముందు ఆలోచన తో బీజేపీ గవర్నమెంట్ ఇటీవల చిరంజీవికి కేంద్రం పద్మవిభూషణ్‌ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే.

Crimejournalist

Jan 30 2024, 20:02

న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ ఒక వర్గ నేతలు

ఫ్లాష్ ఫ్లాష్ న్యూస్

న్యాయవాదుల ఉద్యమ త్యాగానికి మకిలి పట్టించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గ నేతలు

[Crime journalist 30-01-2024] :-

మేడా శ్రీనివాస్ , ఆరోపణ.

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)

కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టం రద్దుకై రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమస్తున్న న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను రాజమండ్రి బార్ అసోసియేషన్ లో గల ఒక వర్గం లో కొంతమంది నేతలు వారి రాజకీయ స్వార్దానికి ఉపయోగించుకుంటున్నారని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ ఆపోయారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా ప్రవేశ పెట్టిన భూ హక్కు చట్టాన్ని రద్దు చేయాలంటు రాష్ట్ర వ్యాప్తంగా గత కొన్ని రోజుల నుండి ప్రజల పక్షాణ రాజకీయాలకు అతీతంగా న్యాయవాదులు విధులు భహిష్కరించి ఉద్యమాలు చేస్తున్నారు.

ఈ తరుణంలో న్యాయవాదుల ఉద్యమ త్యాగాలను అవమాన పరిచే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు సొంత ప్రయోజనాల కోసం రాజమండ్రి రూరల్ కాతేరు ప్రాంతంలో జరిగిన చంద్రబాబు నిర్వహించిన భహిరంగ సభకు రాజమండ్రి బార్ అసోసియేషన్ నుండి ఒక వర్గానికి చెందిన కొంతమంది నేతలు అత్యుత్సాహంగా భూ హక్కు చట్టం రద్దుకు సహకరించాలంటు చంద్రబాబు సభకు సంఘీభావంగా వెళ్లి కలవటం ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల ఉద్యమ త్యాగాలకు బ్రష్టు పట్టించారన్నారు . ఆంధ్రప్రదేశ్ న్యాయవాదుల సంఘం, బార్ కౌన్సిల్ వారి అనుమతి లేకుండా చంద్రబాబు ను కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయవాదులపై తప్పుడు సాంకేతాలు ఏర్పడే విధంగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక వర్గానికి చెందిన నేతల చర్యలు ఉండటం బాదాకరం. గతంలో న్యాయవాదుల హక్కుల పై గళ మెత్తిన కొంతమంది యువ న్యాయవాదులపై బార్ కౌన్సిల్ వారు క్రమ శిక్షణా చర్యలు క్రింద నోటీసులు జారి చేసారని అని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేస్తున్నారు .రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేస్తున్న నిరసన ఉద్యమానికి మకిలి ఏర్పడే విధంగా ప్రవర్తించిన రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఒక(ఆ)వర్గం నేతల పై చర్యలు ఉంటాయా !

ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు రోజు వారి ఆధాయాలు కోల్పోతు నిజాయితీగా విధులు భహిస్కరిస్తు ఉద్యమిస్తుంటే రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు ఉద్యమం చేస్తున్నట్టు గానే విధులు నిర్వహిస్తు రాష్ట్ర న్యాయవాదులను మోసాగిస్తున్నారనే అపవాద వుందన్నారు . భూ హక్కు చట్టం రద్దు కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)తో పాటుగా అనేక మంది ఏపి హై కోర్టులో వాజ్యాలు దాఖలు చేసారని ఆయన తెలిపారు.ప్రస్తుతం విచారణలు సాగుతుండగా రాజమండ్రి బార్ అసోసియేషన్ లో ఆ వర్గం వారు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదని ఒక ప్రక్కన హేళనగా మాట్లాడేది ఆ వర్గం వారే, చంద్రబాబు సభ కు భూ హక్కు చట్టం వంకతో వెళ్ళేది ఆ వర్గం వారే అని అనేక మంది న్యాయవాదులు గుస గుస లు వినిపిస్తున్నాయి.

రాజమండ్రి బార్ అసోసియేషన్ లో

ఆ వర్గం ప్రవర్తన కారణంగా న్యాయవాదులు రాజకీయ పార్టీల వారిగా విడిపోయి న్యాయవాదుల ఐక్యత దెబ్బ తినే ప్రమాదం ఉందని , రాజమండ్రి బార్ అసోసియేషన్ లో చంద్రబాబు ను కలిసిన ఆ వర్గం వారు భూ హక్కు చట్టం పై ఉద్యమం చేస్తున్నారో , రాజకియం చేస్తున్నారో రాజమండ్రి బార్ అసోసియేషన్ వారు వివరణ ఇవ్వాలని లేకుంటే రాజమండ్రి న్యాయవాదులు పై రాజకీయ ముద్ర పడే ప్రమాదం ఉందని ఆలా ప్రధాన కార్యదర్శి మేడా శ్రీనివాస్ తెలిపారు..

--మేడా శ్రీనివాస్,

  ప్రధాన కార్యదర్శి,

ఆంధ్ర లాయర్స్ అసోసియేషన్ (ఆలా)